హుగ్లీ: కాలుకు గాయం కావడంతో వీల్ చైర్లోనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఈ ఎన్నికల్లోనూ తృణమూల్ ఘనవిజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఒంటి కాలుతోనే తాను బెంగాల్లో విజయం సాధిస్తానని, భవిష్యత్తులో రెండు కాళ్లతో ఢిల్లీలో కూడా విజయం సొంతం చేసుకుంటానని వ్యాఖ్యానించారు. హుగ్లీలోని దేబనందపూర్లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆమె మాట్లాడారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను 8 విడతల్లో నిర్వహించాల్సిన అవసరం ఏమున్నదని మమత ఈసీని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో కొవిడ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్కువ వ్యవధిలో ఎన్నికలు ముగించలేరా అని ఈసీని నిలదీశారు. బీజేపీకి అభ్యర్థులు లేకపోవడంవల్లే టీఎంసీ, సీపీఎం నేతలను చేర్చుకున్నారని, డబ్బులను మంచి నీళ్లలా వెదజల్లుతున్నారని ఆరోపించారు. బంగారు బంగ్లా అంటూ మాటలు చెబుతున్నవాళ్లకు ఈ బెంగాల్ను పాలించే సత్తానే లేదని ఎద్దేవా చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఎల్జీ కంపెనీ సంచలన నిర్ణయం..!
స్థిరంగా పసిడి ధర.. స్వల్పంగా తగ్గిన వెండి
కొవిడ్తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో
టీకా వేయించుకుంటే ముక్కుపుల్ల ఉచితం..!
మధుమేహం ఉన్నవారు కార్న్ఫ్లేక్స్ తినొచ్చా..?