రద్దీప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి
రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్
రామాయంపేట, ఏప్రిల్ 4: ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్ర అన్నారు. ఆదివారం ఎస్వైఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. పట్టణంలోని రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే 25 మంది కొవిడ్ బారిన పడినట్లు తెలిపారు. వ్యాపారస్తులు నిబంధనలను పాటించడం లేదని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మాస్క్లు లేకుండా విక్రయాలను జరుపుతున్నారని చెప్పారు. దుకాణంలో ఎవరికి మాస్క్ లేకున్నా దుకాణ యజమానులు బాధ్యత వహించాలన్నారు. మాస్క్ పెట్టుకోకపోతే రూ.500 చొప్పున వ్యాపారి వద్ద నుంచి వసూలు చేస్తామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ దేమె యాదగిరి, శ్యాంసుందర్, చింతల యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు బాసం శ్రీనివాస్, కన్నపురం కృష్ణాగౌడ్, యాద నాగరాజు, స్వామిగౌడ్ పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలి
కరోనా మహమ్మారి వ్యాప్తి సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్ పట్టణ ప్రజలకు సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను పాటించాలన్నారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లినప్పుడు మాస్క్లు ధరించాలన్నారు. జనసంచారం, రద్దీ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దుకాణాల్లో బోర్డులు పెట్టాలని కిరాణషాపులు, వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులకు సూచించారు. 45 ఏండ్లు పైబడిన వ్యక్తులు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.