మాస్టర్తో హిట్ కొట్టిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఈ కోలీవుడ్ దర్శకుడి తదుపరి చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్నట్లు తెలుస్తోంది. లోకేష్ ఇటీవల తమిళ స్టార్, ఇళయపతి విజయ్కి సంక్రాంతి సందర్భంగా భారీ హిట్ను అందించాడు. ఇటీవల లోకేశ్ కొవిడ్-19 పాజిటివ్గా పరీక్షించడంతో.. చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం లెజెండ్ కమల్ హాసన్తో ‘విక్రమ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే ప్రభాస్తోనే చిత్రం తీస్తారని, ఈ మేరకు కథ సిద్ధం చేసినట్లు కోలీవుడ్లో టాక్.
టాలీవుడ్ స్టార్ పాన్ ఇండియా స్థాయి చిత్రాలు ఆది పురుష్, సలార్లో నటిస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులపై భారీ అంచనాలున్నాయి. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ మూడు చిత్రాల తర్వాత ఈ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని తెలిసింది. ప్రభాస్ ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అందుకే ఆయనతో సినిమా చేయడం కోసం అన్ని సినీ పరిశ్రమల నుంచి దర్శకులు ఉత్సాహం చూపుతున్నారు. మరో వైపు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ జూలైలో విడుదలకు సిద్ధమవుతోంది.