నల్లగొండ : సబ్బండ వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన పెద్దవూర మండలం కొత్తలూరు గ్రామంలో మైనారిటీ నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మహమ్మద్ అలీ మాట్లాడుతూ.. 30 ఏండ్లుగా మంత్రిగా ఉన్న జానారెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సాగర్ నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని, పార్టీ అభ్యర్థి భగత్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు.
తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు అండగా ఉండాలని కోరారు. అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి