రాజన్న సిరిసిల్ల : ముస్తాబాద్ మండలం మోహినికుంటలో పోత్గల్ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన పెట్రోల్ బంక్ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ నగర్లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత లబ్దిదారులు ఆ ఇండ్లలో గృహప్రవేశం చేశారు.
మరికాసేపట్లో మద్దికుంటలో రైతువేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారు. అక్కడ్నుంచి చీకోడు బయల్దేరి.. రైతువేదిక, గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం చేస్తారు. ముస్తాబాద్, ఆవునూరులో రైతు వేదికలను కేటీఆర్ ప్రారంభించనున్నారు. హరిదాసునగర్లో గ్రామ కమ్యూనిటీ హల్, శ్మశానవాటిక, పల్లెప్రకృతివనం ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఉత్తమ గ్రామపంచాయితీ అవార్డుకు ఎంపికైనందుకు పాలకవర్గానికి సన్మానం చేయనున్నారు.