కొవిడ్ నేపథ్యంలో సాదాసీదాగా వేడుకలు
18 ఏండ్ల క్రితం ఓ భక్తుడు ఇచ్చిన రథం వినియోగం
కొనసాగుతున్న లక్ష్మీ నర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు
ధర్మపురి, ఏప్రిల్ 2: ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా శుక్రవారం ధర్మపురీశుల రథోత్సవం కొవిడ్ నిబంధనల మేరకు ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించారు. భక్తులను అనుమతించలేదు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం యజ్ఞాచార్యుడు పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం 18 ఏండ్ల క్రితం ఓ భక్తుడు ఇచ్చిన చిన్న రథాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. రథం ఎదుట బలిహరణ పూజలు నిర్వహించారు. లక్ష్మీనరసింహస్వామి (ఉగ్ర, యోగా), శ్రీవేంకటేశ్వరస్వామివార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహన సేవపై ఉంచి ఆ రథం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయించారు. అనంతరం ముగ్గురు స్వాముల ఉత్సవమూర్తులను రథంపై ఆసీనులను చేసి ఆలయ ప్రాంగణంలో రథోత్సవాన్ని నిర్వహించారు. రామలింగేశ్వరాలయంలోనూ రథోత్సవం జరిపించారు. రాత్రి ఉత్సవమూర్తులను గోదావరి నదికి తీసుకెళ్లి చక్రతీర్థ పూజలు నిర్వహించారు. అనంతరం యోగా నరసింహస్వామివారి పుష్పయాగం జరిపారు.
ఇవి కూడా చూడండి..
ఆస్ట్రాజెనికా టీకా అవసరంరాదేమో : అమెరికా