హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఉత్సవమూర్తులకు ఓ అజ్ఞాత భక్తుడు రెండు కిలోల బంగారు కవచాన్ని కానుకగా సమర్పించినట్టు టీటీడీ అధికారులు శనివారం మీడియాకు వెల్లడించారు. మొత్తం 19 భాగాలుగా ఉన్న బంగారు కవచాన్ని ఉత్సవాల సమయంలో స్వామివారికి అలంకరించనున్నట్టు తెలిపారు.