అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గత 24 గంటల్లో 18,561 కేసులు నమోదు కాగా, 109 మంది మరణించారు. ఈ వైరస్ నుంచి 17,334 మంది కోలుకుని ఇవాళ డిశ్చార్జి అయ్యారు. ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 14,54,052కు చేరింది. ఇప్పటి వరకు 9,481 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.