Andhrapradesh-news
- Jan 24, 2021 , 18:04:20
VIDEOS
ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు

అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 158 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 155 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇవాళ కరోనా మరణాలేవి సంభవించలేదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 8,87,010 కరోనా కేసులు నమోదయ్యాయి. 8,78,387 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
మరో 1,476 మంది చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా 7,147 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రవాప్తంగా ఇవాళ 44,382 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు కోటి 28 లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
MOST READ
TRENDING