అమరావతి : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 15,284 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. 20,917 మంది చికిత్సకు కోలుకున్నారు. వైరస్ బారినపడి 106 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 1,60,9105 చేరాయి. 1,40,0754 మంది కోలుకున్నారు. ఇంకా 1,98,023 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 10328కి పెరిగాయి. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 72,979 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.