అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 14,429 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 20,746 మంది కోలుకున్నారు. 103 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 1,65,7986కు పెరిగాయి. 1,46,6990 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్ కేసులు 1,80,362కు చేరాయి. మొత్తం 10634 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 84,502 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.