అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో కరోనా తీవ్ర కలకలం రేపుతున్నది. థర్మల్ ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న చాలామంది ఉద్యోగులు ఇప్పటికే కరోనా బారినపడి విలవిలాడుతున్నారు.
కొవిడ్ బారినపడిన వారిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఇవాళ ముగ్గురు మృతి చెందారు. పదిరోజుల వ్యవధిలో ఇక్కడ 14 మంది ఉద్యోగులు మహమ్మారికి బలయ్యారు.
దీంతో కార్మికులు, ఉద్యోగులు విధులకు హాజరుకావాలంటే హడలిపోతున్నారు. ఏపీలో కరోనా ఉధృతరూపం దాల్చింది. నిత్యం 20 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
నిత్యం 50 మందిపైగా మృత్యువాత పడుతున్నారు. కరోనా కట్టడికి ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం పగటి కర్ఫ్యూ అమలు చేస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.