రామాయంపేట, తూప్రాన్ రూరల్, చేగుంట, నిజాంపేట, మనోహరాబాద్, మే 18 : ప్రభుత్వ నిర్ణయం మేరకు రామాయంపేట, తూప్రాన్, చేగుంట, మనోహరాబాద్, నార్సింగి, చేగుంట, నిజాంపేట మండలాల్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం తూప్రాన్ పట్టణంలోని పోలీసులు రోడ్డుపైకి చేరుకుని పహారా కాశారు. ప్రజలు పది గంటల లోపే అన్ని పనులు పూర్తి చేసుకొని తమ ఇండ్లకు తిరిగి వెళ్లిపోయారు. దీంతో రోడ్లు, దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ ప్రజలు లేక నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు పది గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రోడ్లపై చెక్పోస్టులు ఏర్పాటు చేసి రోడ్లపైకి వస్తున్న వాహనాలను ఆపుతున్నారు.
నర్సాపూర్లో…
తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ నర్సాపూర్ నియోజకవర్గంలో కట్టుదిట్టంగా కొనసాగుతున్నది. నర్సాపూర్, కొల్చారం, కౌడిపల్లి, చిలిపిచెడ్ మండలాల్లో లాక్డౌన్తో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. వెల్దుర్తి మండలంలో ఎస్సై మహేందర్ లాక్డౌన్ను పర్యవేక్షించారు.