ఎల్బీనగర్/మన్సూరాబాద్, మే 19 : లాక్డౌన్ సమయంలో అన్నపూర్ణ కేంద్రాలు అన్నార్తుల ఆకలి తీర్చుతున్నాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బుధవారం ఇన్నర్ రింగ్రోడ్డులో మన్సూరాబాద్ కామినేని దవాఖాన ఫ్లై ఓవర్ కింద ఏర్పాటు చేసిన అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భో జనం చేస్తున్న వారిని ఆహారం ఎలా ఉందంటూ ఆరా తీశారు. వారికి ఎమ్మెల్యే స్వయంగా అన్నం వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా తీవ్రత నేపథ్యంలో లాక్డౌన్ విధించిన ప్రభుత్వం అన్నార్తులు ఆకలితో అలుమటించకుండా అన్నపూర్ణ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసిందని చెప్పారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మొత్తం 18 కేంద్రాలు కొనసాగుతున్నాయ ని, ఒక్కో కేంద్రంలో సుమారు 150 నుంచి 200వరకు ఉచిత భోజన సదుపా యం కల్పిస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 45 వేల మంది బీదవారికి అన్నపూర్ణ కేంద్రాలు ఆహారం అందిస్తున్నాయన్నారు. కార్మికులు, చిరుద్యోగులు, కూలీలకు సమతుల్య పౌష్టికాహారాన్ని అన్నపూర్ణ కేంద్రాల ద్వారా వేడివేడిగా అందిస్తున్నారని అన్నారు.