అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్నది. వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా.. మరణాలు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తున్నది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,434 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన 7,055 మంది కోలుకున్నారు. 64 మంది మృతి చెందారు.
ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,54,875కి చేరింది. 9,47,625 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 99,446కి పెరిగాయి. 7,800 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 74,435 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి