ఆరుతడి పంటల్లో మొక్కల చుట్టూ ఉండే వేర్ల భాగాన్ని కప్పి ఉంచడమే ‘మల్చింగ్’. పూర్వం ఈ పద్ధతికి వరిపొట్టు, రంపం పొట్టు,చెరుకు పిప్పి, ఎండిన ఆకులు, చిన్నచిన్న గులకరాళ్లు వాడేవారు.ప్రస్తుతం ‘ప్లాస్టిక్ షీట్’తో ‘మల్చింగ్’ చేస్తున్నారు. దీనివల్ల అనేక లాభాలు..
విత్తనాలు వేయడానికి ముందు లేదా మొక్కలు మొలిచిన తర్వాతైనా మల్చింగ్ షీట్ వేసుకోవచ్చు. ఇందుకోసం మొదటగా, మొక్కల మధ్య, వరుసల మధ్య దూరాన్ని బట్టి షీటుపై రంధ్రాలు చేయాలి (ప్రస్తుతం రంధ్రాలున్న షీట్లు కూడా దొరుకుతున్నాయి). వీటిని నాగలి సాళ్ల మీద పరిచి, రెండువైపులా కొనలపైన మట్టిని ఎగదోయాలి. దీనివల్ల మల్చింగ్ కవర్ గాలికి కొట్టుకుపోకుండా ఉంటుంది. ఒక్కో రంధ్రంలో రెండు లేదా మూడు విత్తనాలు వేసి, మట్టిని కప్పాలి.
ఉద్యాన పంటల్లో మల్చింగ్ వల్ల అనేక లాభాలుంటాయి. నీటి ఆదాతోపాటు కలుపు నివారణ కూడా చాలా తేలిక. నేలలో తేమ శాతాన్నీ కాపాడుకోవచ్చు. ఎరువులకు అయ్యే ఖర్చు భారీగా తగ్గుతుంది. మొక్కలకు అన్ని రకాల పోషకాలు అందడం వల్ల నాణ్యమైన దిగు
బడులు వస్తాయి.
–సీహెచ్.నరేశ్, కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త, గడ్డిపల్లి
నట్టే కోటేశ్వర్ రావు