ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు అనే సామెత అందరికీ తెలిసిందే. అదే కాదు.. ఈ ఉల్లిగడ్డ పొట్టుతో ఇంట్లోనే సేంద్రీయ ఎరువును కూడా తయారు చేయొచ్చు. ఉల్లిని తరిగిన తర్వాత ఆ పొట్టును చెత్తడబ్బాలో పడేయకుండా.. జీరో బడ్జెట్తో ఎరువును తయారు చేయొచ్చు. ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్ వంటి ఖనిజాలు ఉల్లిగడ్డ పొట్టులో పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ పొట్టును సేంద్రీయ ఎరువుగా మార్చి మొక్కలకు చల్లితే అవి ఎదిగేందుకు దోహదపడుతుంది. ఇక మార్కెట్లలో వేల రూపాయాలు ఖర్చు పెట్టి ఎరువులను కొనాల్సిన అవసరం లేదు.
ఊదా రంగులో ఉన్న ద్రావణాన్ని మొక్కలకు పోయడం వల్ల పుష్కలంగా పొటాషియం లభిస్తుంది. ఈ ద్రావణాన్ని పెరడులోని మొక్కలతో పాటు ఇతర మొక్కలకు కూడా ఉపయోగించొచ్చు. ఇలా నెలలో కనీసం మూడు నుంచి నాలుగు సార్లు చేస్తే మొక్కలు ఎలాంటి వ్యాధులకు గురికావు.