న్యూఢిల్లీ: వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖర్లో కొనసాగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదింటిలో ఓడి ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్న హైదరాబాద్..కెప్టెన్సీ మార్పునకు సిద్ధమైంది. హార్డ్హిట్టర్ డేవిడ్ వార్నర్పై వేటు వేసిన సన్రైజర్స్ యాజమాన్యం..కేన్ విలియమ్సన్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. సీజన్లో మిగిలిన మ్యాచ్లకు విలియమ్సన్ నాయకునిగా వ్యవహరిస్తాడని ఫ్రాంచైజీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ, మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ కెప్టెన్సీ మార్పు విషయంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. ‘ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్ నుంచి విలియమ్సన్ హైదరాబాద్కు నాయకునిగా ఉంటాడు. మిగిలిన మ్యాచ్ల కోసం విదేశీ ఆటగాళ్ల కూర్పు కూడా మారబోతున్నది’ అంటూ రైజర్స్ యాజమాన్యం స్పష్టం చేసింది.