ఎన్నికల ప్రచారంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి
టీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం
ఖమ్మం/ మామిళ్లగూడెం, ఏప్రిల్ 26: ఖమ్మం నగర అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు, ఆ పార్టీ మద్దతుతో పోటీలు చేస్తున్న సీపీఐ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం నగరంలోని వివిధ డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిండు మనుసుతో ఆశీర్వదించాలని కోరారు. టీఆర్ఎస్ బలపర్చిన సీపీఐ అభ్యర్థి చామకూరి వెంకటనారాయణ, 24వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి కమర్తపు మురళి, 27వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి పాలడుగు పాపారావులకు మద్దతుగా ఆయా డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, సీపీఐ నేత బాగం హేమంతరావు పాల్గొన్నారు.
46, 48 డివిజన్లలో..
నగరంలోని 46, 48 డివిజన్లలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న కన్నం వైష్ణవి, తోట గోవిందమ్మ విజయాన్ని కాంక్షిస్తూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేంద్రరావు కలిసి రోడ్షో నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు.