మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్ ఫుల్ మెగా ఎంటర్ టైనర్ `ఆచార్య`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో కాజల్ – పూజా హెగ్డే కథానాయికలు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవల ఖమ్మం షెడ్యూల్ లో చిరంజీవి- రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. తాజాగా ఈ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిందని నిర్మాతలు వెల్లడించారు. నిర్మాతల్లో ఒకరైన నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..ఖమ్మం షెడ్యూల్ ని ఎలాంటి ఆటంకాల్లేకుండా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి తిరిగి హైదరాబాద్ చేరుకున్నామని చెప్పారు. చిరంజీవి-చరణ్ పై కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించామని వివరించారు. ఈ సినిమా మే 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.