ఆదిలాబాద్ : పేదలకు ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ అన్నారు. ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన ప్రజలకు అందుతున్న వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో పారిశుధ్యంపై అవగాహన కల్పించాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.