దహెగాం: ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రానికి చెందిన తుమ్మిడ కళావతి(35) బుధవారం విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ రాజమౌళి తెలిపారు. గేదెకు పచ్చిగడ్డి తేవడానికి ఇంటి సమీపంలోని ఎల్కరి వెంకన్న పొలానికి వెళ్లింది . అక్కడ గడ్డి కోస్తుండగా అక్కడే ఉన్న విద్యుత్ వైర్ను గమనించక తాకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
భార్య తిరిగి రాకపోవడంతో భర్త నారాయణ కూతురు అంజలిని పంపించగా పొలంలో తల్లి చనిపోయి ఉండడాన్ని గమనించి తండ్రికి సెల్ఫోన్లో సమాచారం అందజేసింది. మృతురాలు భర్త నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు.