నిర్మల్ అర్బన్ : టీఆర్ఎస్ పార్టీ ఫ్లీనరీ, వరంగల్లో విజయ గర్జన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు హైదరాబాద్లో నిర్వహిస్తున్న సన్నాహక సమావేశానికి నిర్మల్ జిల్లా నుంచి నాయకులు తరలివెళ్లారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, పార్టీ పట్టణ అధ్యక్షులు మారుగొండ రాము తదితరులు, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మండలాలకు చెందిన పార్టీ నాయకులు శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్నారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్భంగా సన్నాహక సమావేశంలో పాల్గొన్న నాయకులకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.