బజార్హత్నూర్ : టీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పిలుపునిచ్చారు. బజార్హత్నూర్ మండలంలో నూతనంగా ఎన్నికైన గ్రామకమిటీల అధ్యక్షులు, మండల కమిటీల సభ్యులు శనివారం ఆదిలాబాద్లో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులందరినీ శాలువాతో సన్మానించారు. మండల కన్వీనర్గా రాజారాం రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికకావడంతో బజార్హత్నూర్ మండల కార్యకర్తలు , నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని, పార్టీ అభ్యున్నతికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన కోరారు.
అంతకుముందు మండల కన్వీనర్ రాజారాంకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొడ్డు శ్రీనివాస్,మడిగే రమణ, భాస్కర్రెడ్డి, సింగ్, ప్రకాశ్, ఉత్తం, విజేందర్, మధుకర్, నరేశ్, విద్యాసాగర్, శశికళ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.