ఆదిలాబాద్: జిల్లాలోని గుడిహత్నూర్లో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని మన్నూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున ట్రాక్టర్ను మినీ లారీ ఢీకొన్నాయి. దీంతో అదుపుతప్పిన లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ట్రాక్టర్ డ్రైవర్ గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను లారీ డ్రైవర్ రామాంజనేయులు, క్లీనర్ ఖాజా, ట్రాక్టర్పై కూర్చున్న మరో వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు పంపించారు. మినీ లారీ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ధర్మారం నుంచి టమాటా లోడుతో మహారాష్ట్రలోని నాగ్పూర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.