ఎదులాపురం : ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని అభివృద్ధి చేస్తుంది కేవలం తెలంగాణ ప్రభుత్వమేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఆదివాసీ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ముందుగా వారి సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని ఆదివాసీ ప్రాంతాల్లోని గ్రామానికొక కుమ్రం సూరు విగ్రహం ఏర్పాటు జోగు ఫౌండేషన్ ద్వారా చేస్తామన్నారు .
ట్రైకార్ రుణాలు అర్హులైన వారందరికీ ముంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ సహకారంతో మారుమూల గ్రామాలలో సైతం అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదని అన్నారు. అటవీ హక్కు పత్రాలను పంపిణీ చేసేందుకు సీఎం కేసీఆర్ సానుకులంగా ఉన్నారని ఇటీవల సీఎం కేసీఆర్ అసెంబ్లీలో హక్కుపత్రాలపై ప్రస్తావించారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో కొలం సంఘం జిల్లా అధ్యక్షుడు కొడప సొనేరావ్, కుమురం సూరు యువసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్ర రాజు, ఎంపీటీసీలు కుమ్ర జంగు పటేల్ తదితరులు పాల్గొన్నారు.