ఎదులాపురం : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో తెలంగాణకు కేటాయించిన ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటులో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని యూనివర్సిటీ సాధన కమిటీ కన్వీనర్ రాయిసిడం బాపురావు ఆరోపించారు. ట్రైబల్ యూనివర్సిటీ కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రచారంలో భాగంగా శనివారం ఆదిలాబాద్ పట్టణానికి ప్రచారసభ్యులు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చౌరస్తా వద్ద కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 20వ తేదీన ఉట్నూర్లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ట్రైబల్ యూనివర్సిటీ సాధన కమిటీ ప్రచార క్యాంపెయిన్కి విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కోట ఆనంద్, కాత్లే మారుతి, ఉపేంద్ర, విద్యార్థి సంఘాల నాయకులు వినోద్, రాల్, మడావి గణేశ్, మేస్రం భాస్కర్, నాగేశ్ ,కపిల్ తదితరులు పాల్గొన్నారు.