బజార్హత్నూర్ : నిరుద్యోగ యువత కోసం జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని బోథ్ సీఐ నైలు అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం బజార్హత్నూర్ మండలకేంద్రంలోని ఫంక్షన్హాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా నిరుద్యోగ యువతకు ఉచిత జాబ్మేళాను నిర్వహించారు. ఈ జాబ్మేళాకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు తరలివచ్చారు.ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జీఎంఆర్ సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా ప్రైవేట్ సంస్థల్లోనూ మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు చేయవచ్చని సూచించారు.
జాబ్ మేళాలు పట్టణ ప్రాంతాలే కాకుండా చిన్న చిన్న పట్టణాలు, మండల కేంద్రాల్లో నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సై ఉదయ్కుమార్, జీఎంఆర్ సెక్యూరిటీ ఆఫీసర్ సూదమ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.