ఆదిలాబాద్ : వర్షాల వల్ల అంటువ్యాధులు ప్రాబలే ప్రమాదం ఉన్నందున జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరం లో నిర్వహించిన గ్రామీణాభివృద్ధి సమీక్ష సమావేశం లో వివిధ శాఖల అధికారులు తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్ సూచించారు.
స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలలో దోమలు వ్యాపించకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. హరితహారం మొక్కలకు జియో ట్యాగ్గింగ్ తప్పనిసరి చేయాలన్నారు. ప్రకృతి వనాలలోని కలుపు మొక్కలు వర్షా కాలంలో రెండు సార్లు తప్పనిసరిగా తొలగించాలన్నారు.
కూలీలకు వెంటనే బిల్లులు చెల్లించాలని పంచాయతీ రాజ్ ఈఈని ఆదేశించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీ సీఈఓ, డీఆర్డీవో ఇంచార్జి పీడీ సుధీర్, పంచాయతీ రాజ్ ఈఈ, శంకరయ్య, డీఈవో టీ ప్రణిత, వ్యవసాయ శాఖ ఏడీ బి వినయ్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.