ఆదిలాబాద్ రూరల్ : విద్యార్థులకు చిన్నతనం నుంచే పర్యావరణంపై అవగాహన కల్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి టామ్నె ప్రణీత అన్నారు. శనివారం పట్టణంలోని భుక్తాపూర్ మరాఠీ మీడియం ప్రాథమికోన్నతపాఠశాలలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు హరితహారం ఆవశ్యతను వివరించి ప్రతి విద్యార్థి మూడు మొక్కలు నాటి సంరక్షించేలా అవగాహనకల్పించాలన్నారు. ఈ పాఠశాలలో మొక్కల పెంపకానికి ఉపాధ్యాయురాలు స్వాతి రూ.10వేలు, మరో ఉపాధ్యాయుడు గణేశ్ రూ.5వేలువిరాళంగా అందించడంతో వారిని అభినందించారు.
ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు దాతృత్వగుణం కూడా నేర్పడం సంతోషమని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి జే నారాయణ,ఉపాధ్యాయులు వైశాలి, కవిత, గోపాల్, రితేశ్ తదితరులు పాల్గొన్నారు.