సిరికొండ, సెప్టెంబర్ 18 : ప్రజలు కొవిడ్ టీకాపై భయాందోళనకు గురికాకుండా తప్పనిసరిగా తీసుకోవాలని జడ్పీ సీఈవో గణపతి అన్నారు. మండలంలోని పొచ్చంపల్లి, పొన్న, తుమ్మలపాడు, సుంకిడి గ్రామాల్లో పిట్టబొంగురం, నర్సాపూర్ ప్రభుత్వ దవాఖాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను శనివారం ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ అమృత్రావ్, ఎంపీడీవో సురేశ్, పొచ్చంపల్లి సర్పంచ్ జయాబాయి, పంచాయతీ కార్యదర్శి నరేశ్, ఐకేపీ ఏపీఎం సంతోష్, ఏఎన్ఎం విజయసుందరి, విజయ్, సుశీల, హెల్త్అసిస్టెంట్ గంగారాం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
భీంపూర్, సెప్టెంబర్18: మండలంలోని గోముత్రి, కరణ్వాడి గ్రామాల్లో కరంజి(టీ) ఆరోగ్య ఉప కేంద్ర ఏఎన్ఎం సుజాత ఆధ్వర్యంలో మొదటి డోసు కొవిడ్ టీకా వేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు నిమ్మ వేణుయాదవ్, నైనతాబాయి, ఆశ కార్యకర్తలు కొక్కెరి రోజా, సంగీత, అంగన్వాడీ కార్యకర్త కవిత, పంచాయతీ కార్యదర్శి సందీప్ పాల్గొన్నారు.
నార్నూర్, సెప్టెంబర్ 18: మండలంలోని తాడిహత్నూర్, నాగల్కొండ, దుర్గనగర్, గంగాపూర్, నార్నూర్, భీంపూర్, చిత్తగూడ, దన్నుగూడ గ్రామాల్లో నార్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను మండల ప్రత్యేకాధికారి శ్రీనాథ్ పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో రమేశ్, ఏపీఎం రమేశ్, హెచ్ఈవో చౌహాన్ నాందేవ్, వైద్యసిబ్బంది, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది ఉన్నారు.
నార్నూర్, సెప్టెంబర్ 18: గాదిగూడ మండలం ఝరి పీహెచ్సీ పరిధిలోని అర్జుని, లోకారి(బీ), పూనగూడ, లోకారి(కే), రాజుల్గూడ గ్రామాల్లో చేపట్టిన వ్యాక్సినేషన్ను డీఆర్డీవో రాథోడ్ రవీందర్ పరిశీలించారు. గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. వ్యాక్సినేషన్పై అపోహలు పెట్టుకోవద్దని నిర్భయంగా టీకా వేసుకోవాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో రామేశ్వర్, మెడికల్ అధికారి పవన్కుమార్, ఎంపీవో సాయిప్రసాద్, సర్పంచ్లు, వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
ఎదులాపురం, సెప్టెంబర్ 18 : ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శైలజ సూచించారు. జిల్లా కేంద్రంలోని 10వ వార్డు రాంనగర్లో వ్యాక్సినేషన్ సెంటర్ను పరిశీలించారు. వంద శాతం పూర్తి చేయాలని వైద్య, మున్సిపల్ సిబ్బందికి సూచించారు. ఆమె వెంట కౌన్సిలర్ సుజాత భూమన్న, ఏఎన్ఎం శ్రీవాణి, జూనియర్ అసిస్టెంట్ దత్తత్రి, రెవెన్యూ సిబ్బంది అజయ్, రాజలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు సరోజ, సులోచన, పుష్పలత ఉన్నారు.
జైనథ్, సెప్టెంబర్ 18: మండలంలోని ఉమ్రి, బెల్గాం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ను ఎంపీడీవో గజానన్ పరిశీలించారు. గ్రామాల్లో వంద శాతం వ్యాక్సిన్ వేసేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో వెంకటరాజు, ఏపీవో జగ్గేరావు, సర్పంచ్లు, వైద్యసిబ్బంది ఉన్నారు.
బేల, సెప్టెంబర్ 18: మండలంలోని బెదోడ, చప్రాల, సైద్పూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను ఎంపీడీవో భగత్ రవీందర్, మండల ప్రత్యేకాధికారి శంకర్ పరిశీలించారు. వారి వెంట మండల పంచాయతీ అధికారి సమీర్ హైమద్ , సర్పంచ్ బాలేరావు అర్చన, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు.
తాంసి, సెప్టెంబర్ 18: మండలంలోని కప్పర్ల, పొన్నారిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవిడ్ టీకా శిబిరానికి ప్రజల నుంచి స్పందన లభించింది. ఇప్పటి వరకు 671 మందికి వ్యాక్సిన్ వేశారు. ఆదివారం కూడా శిబిరం నిర్వహిస్తామని ఏఎన్ఎం సుగుణ తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎం లక్ష్మి, అంగన్వాడీ, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
బోథ్, సెప్టెంబర్ 18: మండలంలోని కుచ్చిరాలతండాలో వ్యాక్సినేషన్ను మండల పంచాయతీ అధికారి జీవన్రెడ్డి పరిశీలించారు. ఆశకార్యకర్తలు, వీఏవోలు ఇంటింటికీ తిరిగి జాబితా తయారు చేస్తూ అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. పార్డీ (బీ), కుచులాపూర్, కన్గుట్ట, పిప్పిల్ధరి, నక్కలవాడ గ్రామాల్లో వ్యాక్సినేషన్ వేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, సెప్టెంబర్ 18: దుర్గాపూర్ గ్రామంలో మత్తడిగూడ సర్పంచ్ మడావి యశోదాబాయి ప్రజలకు కొవిడ్ టీకాపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ మోతీరాం, అంగన్వాడీ టీచర్ సానుబాయి, ఆశ కార్యకర్త సిడాం నాగుబాయి పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 18: మండలంలోని కెస్లాపూర్, పాటగూడ, గ్రామాల్లో కొవిడ్ టీకా శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, సీహెచ్వో బాబులాల్ పాల్గొన్నారు.