ఇంద్రవెల్లి : రుషి పంచమి ఉత్సవాలను ఇంద్రవెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అందునాయక్తండాలో శనివారం ఘనంగా నిర్వహించారు. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర , ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మథురా సమాజ్(లభాన్)కులస్తులు, యువకులు, మహిళలు వేర్వేరుగా సంప్రదాయ నృత్యాలు చేశారు. గ్రామంలోని జ్వలాముఖిదేవి, కాళుబాబా, పచుబాబా ఆలయ ఆవరణలో రాంసింగ్మహరాజ్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి రుషిపంచమి ఉత్సవాలను నిర్వహించారు. అనంతరం రాంసింగ్మహరాజ్ను దర్శించుకున్నారు.
కుల పెద్దలు ఆలయ ఆవరణలో సంప్రదాయ పచ్చీస్ ఆటను ఆడారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పాల్గొని జ్వలాముఖిదేవి, కాళుబాబా, పచుబాబాను దర్శించుకొని పూజలు నిర్వహించారు. మాథురా సమాజ్ (లభాన్) యువకులతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ మహరాజ్ రాంసింగ్బాబా, గ్రామస్తులు చోపాడే బద్దుసింగ్, పడ్వాల్ గోపాల్సింగ్, గేబిసింగ్, షేర్సింగ్, కులపెద్దలు తదితరులు పాల్గొన్నారు.