ఆదిలాబాద్ రూరల్ : అట్టడుగువారి అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎస్టీ లబ్ధిదారులకు రుణాల మంజూరు కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అనేక పథకాల కింద రుణాలు అందిస్తుందన్నారు.
ఎస్టీలకు పట్టణంలో 60మంది లబ్ధిదారులకు రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రుణాలకు ఎంపికైన లబ్ధిదారులు రుణాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, బ్యాంకు ప్రతినిధులు, కౌన్సిలర్లు , మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.