జైనూర్ : తపాల శాఖ ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన కుమ్రం భీం మై పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. శనివారం సిర్పూర్-యూ మండలంలోని చిన్నధోబా గ్రామంలో కుమ్రంభీం మనువడు కుమ్రం సోనెరావుతో కలిసి పోస్టల్ శాఖ ఎస్పీ కేబీఆర్ ప్రసాద్ పోస్టల్ను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టల్ శాఖ ద్వారా ఆధునిక సేవలందిస్తున్నామని వెల్లడించారు. ఐపీపీబీ ఖాతా ద్వారా ఆన్లైన్ లావాదేవీలు అందుబాటులో ఉన్నాయని, సుకన్య సమృద్ధి యోజన, ఆర్డీ, ఎస్బీ, ఎస్ఎస్ఏ, ఆర్పీఎల్ఐ సేవలు తపాల శాఖ ద్వారా అందించడం జరుగుతుందన్నారు.
పంగిడి బ్రాంచి పరిధిలో బీపీఎం సయ్యద్ ఉస్మాన్ అందిస్తున్న ఉత్తమ సేవలను అభినందించారు. ప్రజలు తపాల శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలతో లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కుమ్రం భీం మనువడు కుమ్రం సోనెరావు తపాల శాఖ జిల్లా అధికారికి శాలువాతో సన్మానించారు. . ఈ కార్యక్రమంలో తపాల శాఖ ఐపీవో సుజీత్కుమార్, బీపీఎంలు సయిద్ ఉస్మాన్, నల్లెరావు, హమీద్, సాయికుమార్, వంశీ తదితరులు పాల్గొన్నారు.