సిర్పూర్(టీ) : మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దాదాపు ౩ గంటలకు పైగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలకేంద్రంలోని ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవహించింది. పట్టణంలోని బస్టాండ్ – రైల్వేస్టేషన్ , సిర్పూర్(టీ)- దుబ్బగూడ కాలనీ వద్ద రోడ్ డ్యాంపై నుంచి వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
భారీ వర్షానికి అంబేద్కర్ కాలనీలోని ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీలు లేక పోవడంతోనే ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరుతుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.