బోథ్ : పేదల ఆరోగ్యానికి సర్కారు భరోసా కల్పిస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. సోమవారం ఆదిలాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 16 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ 6,67,000 విలువైన చెక్కులను అందజేశారు. బోథ్ మండలానికి చెందిన ఐదుగురు, ఇచ్చోడ, నేరడిగొండ, తలమడుగు మండలాలకు చెందిన ముగ్గురు చొప్పున, గుడిహత్నూర్, తాంసి మండలాలకు చెందిన ఒక్కొక్కరికి కలిపి 16 మందికి సీఎంఆర్ఎఫ్ కింద ప్రభుత్వం ఆర్థిక సాయం మంజూరు చేసింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కార్పొరేట్ దవాఖానాల్లో వైద్యం చేయించుకున్న పేదలను సీఎంఆర్ఎఫ్తో ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. సీఎంఆర్ఎఫ్ ఆరోగ్య ప్రదాయనిగా మారిందన్నారు. కార్యక్రమంలో ఆయా టీఆర్ఎస్ మండలాల కన్వీనర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మండలంలోని ధన్నూర్(బీ) గ్రామంలో కమ్యూనిటీ భవనాల నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు వినతిపత్రం అందజేశారు. అంబేద్కర్ హరిజన కాలనీ, రజక సంఘ భవనాల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు.