ఉట్నూర్ రూరల్ : నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని మెట్పెల్లి సివిల్ జడ్జి జాదవ్ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం హస్నాపూర్ గ్రామంలోని హనుమాన్ మందిరం పరిసరాల ఖాళీ స్థలంలో ఉన్న పనికిరాని మొక్కలను శ్రమదానంతో తొలగించారు. అనంతరం జడ్జి ఆ స్థలంలో స్థానిక యువకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించడం అంతే ముఖ్యమని అన్నారు. యువత గ్రామ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
గ్రామాలు పరిశుభ్రంగా పచ్చని చెట్లతో ఉంటే వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జగన్, ఉప సర్పంచ్ అశోక్, యువకులు వసంత్రావు, సురేశ్, శంకర్, మానిక్ తదితరులు ఉన్నారు.