ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో విషాద ఘటన జరిగింది. పురుగుల మందు డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హర్కాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ శ్రీదేవి ( 21) డిగ్రీ చదువుతున్నది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగి అనుమానాస్పదంగా బలవన్మరణానికి పాల్పడింది. సోదరి మృతికి తన భార్య, అత్త వేధింపులే కారణమని మృతురాలి అన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి వేధింపుల కారణంగానే యువతి ఆత్మహత్యకు పాల్పడిందా.? లేదా మరేదైనా కారణం ఉందా.? అన్న కోణంలో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.