రెబ్బెన : మద్యం షాపుల్లో 15శాతం రిజర్వేషన్ కల్పిస్తు క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తు శుక్రవారం గౌడ కులస్తులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు . రెబ్బెన మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మతల్లి ఆలయంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మోడెం సుదర్శన్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తుందని అన్నారు. కుల వృత్తులపై ఆధారపడ్డ వారికి జీవనోపాధిని చూపిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రికి తామంతా రుణపడి ఉంటామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ రంగు మహేశ్గౌడ్, డైరెక్టర్ అజయ్జైస్వాల్, ఉపసర్పంచ్ మడ్డి శ్రీనివాసగౌడ్, టీఆర్ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు నవీన్కుమార్జైస్వాల్, సురేశ్జైస్వాల్, గౌడ సంఘం సొసైటీ అధ్యక్షుడు తాళ్లపల్లి కిష్టాగౌడ్, సంఘం నాయకులు సర్వేశ్వర్గౌడ్, అన్నపూర్ణ అరుణ, మురళీగౌడ్, గొడిసెల శ్రీనివాసగౌడ్, ఉమేశ్గౌడ్, సంజీవ్గౌడ్, నర్సగౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు.