బెజ్జూర్ : దవాఖానల్లో ప్రసవమయ్యే తల్లీబిడ్డలకు నిర్వహించాల్సిన అన్ని వైద్య పరీక్షలు దవాఖానలోనే నిర్వహించాలని తద్వారా వారు సురక్షితంగా ఉండేలా చూడాలని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్ర శేఖర్ గేడం అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి వైద్యాధికారి, సిబ్బందికి తగు సూచనలు , సలహాలు చేశారు. ఈ సందర్భంగా లేబర్ రూమ్ను పరిశీలించారు. ఆపరేషన్కు వాడాల్సిన ప్రతి పరికరాన్ని పరిశీలించారు. కాలం చెల్లిన పరికరాలను తొలగించాలని వైద్యాధికారి రుషికి ఆదేశించారు. ఇంజిక్షన్లను ఎలా స్టెరిలైజేషన్ చేస్తున్నారని అడుగగా ఆటో క్లేవ్ పనిచేయడం లేదని వేడి నీటి ద్వారా శుద్ధి చేస్తున్నామని వైద్యాధికారి బదులిచ్చారు.
శిశువులకు విటమిన్ కే, బీడీఆర్ఎల్ టీకాలు అందుబాటులో లేకపోతే బయట నుంచి కొనుగోలు చేసుకొని శిశువులకు అందించాలని సూచించారు. రక్తం, మూత్ర పరీక్షలను నిర్వహించే సమయాలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. ఎక్కువ, తక్కువ సమయాలు పాటించడం వల్ల ఫలితాలు తప్పుగా నమోదు అవుతాయని, పరీక్షలకు కేటాయించిన నిమిషాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని కచ్చితమైన ఫలితాలను పొందవచ్చన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో సుధాకర్ నాయక్, వైద్యాధికారులు రుషి, ముస్తఫా, హెచ్ఈవో కోటేశ్వర్, మలేరియా టెక్నికల్ సూపర్ వేజర్ అశోక్, హెల్త్ సూపర్ వేజర్ రవిరాజ్, హెల్త్ అసిస్టెంట్ ధర్మారావు, హెచ్వి రేణుక, ఫార్మసిస్టు అయేశా తబస్సూం, సిబ్బంధి ఉన్నారు.