బేల, సెప్టెంబర్ 22 : రాష్ట్రంలోని ఆడపడచులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు వరంలా మారాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మండల కేంద్రంలోని గణేశ్ గార్డెన్ లో 70 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పలువురికి మంజూరైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, నాయకులు ప్రమోద్ రెడ్డి, దేవన్న, జక్కుల మధుకర్, సతీశ్ పవర్, వట్టిపెళ్ల్లి ఇంద్రశేఖర్, మంగేశ్ ఠాక్రే, విపిన్ ఖోడే, తహసీల్దార్ బడాల రాంరెడ్డి, ఆర్ఐలు నారాయణ, గీత, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరిక
బేల మండలంలోని భవానీగూడకు చెందిన దాదాపు 100 కు పైగా మహిళలు, యువకులు, గ్రామస్తులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి జోగు రామన్న గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ, , కాంగ్రెస్ పార్టీల నాయకులు అబద్ధాలతో ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకూ ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. అనంతరం భవానిగూడలో హనుమన్ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు గంభీర్ ఠాక్రే ,ప్రమోద్రెడ్డి, వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, దేవన్న, జక్కుల మధుకర్, సంతోష్, మస్కేతేజ్రావు, బండి సుదర్శన్, మంగేష్ ఠాక్రే, వెంకటి, సునీల్, రమేశ్, బుర్రెవార్ దీపక్, జగదీశ్ పాల్గొన్నారు.
పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం..
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 22: ఆదిలాబాద్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పట్టణంలోని కలెక్టర్ చౌక్లో నూతనంగా ఏర్పాటు చేసిన డివైడర్ల మధ్యలో ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పట్టణ సుందరీకరణలో భాగంగా రోడ్ల వెడల్పు,డివైడర్ల ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్ కోసం రూ.36 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గ్రీనరీ పెంపుకోసం ప్రభుత్వం మున్సిపాలిటీకి 10శాతం నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. మావల నుంచి చాంద వరకు రోడ్ల నిర్మాణం, సెంట్రల్లైటింగ్ పనులు పూర్తి కావచ్చయన్నారు. త్వరలోనే వీటిని ప్రారంభిస్తామని చెప్పారు. అనంతరం చాంద, ఠాకూర్హోటల్ వద్ద నిలిచిన రోడ్డు నిర్మాణపనులను పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజానీ, మున్సిపల్ కమిషనర్ శైలజ, ఈఈ వెంకట శేషయ్య, డీఈ తిరుపతి, ఏఈ అరుణ్కుమార్,ఆర్అండ్బీ ఎస్ఈ రాజేందర్ నాయక్, ఈఈ నర్సయ్య, జేఈ శ్వేత, కౌన్సిలర్లు అజయ్, లక్ష్మణ్,రామ్కుమార్ పాల్గొన్నారు.
ఎరువుల దుకాణం ప్రారంభం
జైనథ్, సెప్టెంబర్ 22: జైనథ్ మండల కేంద్రంలో ఎఫ్పీవో ఎరువుల దుకాణాన్ని ఎమ్మెల్యే జోగురామన్న బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్ కుమార్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ చంద్రయ్య, మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్రెడ్డి, ప్రొప్రైటర్లు నిఖిల్రెడ్డి, కార్తిక్రెడ్డి, పురుషోత్తంరెడ్డి, అడెల్లు పాల్గొన్నారు.