నేరడిగొండ, సెప్టెంబర్ 21 : ఆధ్యాత్మిక మార్గం అనుసరించాలని, ఆనందమయ జీవితానికి దోహదపడుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని బోందిడి గ్రామంలో లంబాడాల ఆరాధ్య దైవం రామారావ్ మహరాజ్ విగ్రహానికి మంగళవారం ఆయన భూమి పూజ చేశారు. కుల గురువు ప్రేమ్సింగ్ మహరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తి మార్గంలో పయనిస్తే కుటుంబం సుఖసంతోషాలతో జీవిస్తారని పేర్కొన్నారు. అనంతరం కుల గురువు ప్రేమ్సింగ్ మహరాజ్ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ ఆడె అనిత, నాయకులు జనార్దన్, బుగ్గారం కే సర్పంచ్ జాదవ్ సుభాష్, బోందిడి గ్రామపెద్ద గోవింద్రావ్ నాయక్, ఆడె వసంత్రావ్, రాథోడ్ సుభాష్, ఆడె కైలాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పీఆర్టీయూ స్వర్ణోత్సవాలు..
నేరడిగొండ జడ్పీ ఉన్నతపాఠశాలలో పీఆర్టీయూ టీఎస్ మండల స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ఎమ్మెల్యే బాపురావ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన నారాయణగౌడ్, పద్మనాభగౌడ్, శ్రీనివాస్రెడ్డిని సంఘం బాధ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల భోజన్న, మండల విద్యాధికారి అన్రెడ్డి భూమారెడ్డి, పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణకుమార్, రవీందర్రెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కమలాకర్రావు, గంగాధర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.