ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 21: ప్రతి ఒక్కరూ తప్పని సరిగా కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ షేక్ భాషా అన్నారు. మండలంలోని అర్లి (బీ)లో వ్యాక్సినేషన్ సెంటర్ను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా నుంచి విముక్తి పొందడానికి ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజ నం అందించాలన్నారు. విద్యార్థుల నైపుణ్యాలను పరీక్షించారు. విద్యార్థి ఎం.సాకేత్ పద్యం పాడ డంతో అభినందించారు. అతడికి రూ.500 ప్రోత్సాహకం అందించారు.
వ్యాక్సినేషన్పై దృష్టి సారించాలి
పంచాయతీల్లో వ్యాక్సినే షన్పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ షేక్ భాషా అన్నారు. మండల కేంద్రంలోని అశోక్ నగర్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మండల అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన వారు మండలంలో 15,445 మంది ఉన్నారని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు 5500 మందికి పైగా టీకాలు వేసినట్లు చెప్పారు. మండలంలో మొట్టమొదటగా కొబ్బాయిలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ సుధాకర్తో పాటు పంచాయతీ అధికారులు, ఆశ కార్యకర్త, ఏఎన్ఎం, ఐకేపీ సిబ్బందిని సన్మానిం చారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఎంపీడీవో భగత్ రవీందర్, మండల పంచాయతీ అధికారి సమీర్ హైమద్, సర్పంచ్లు , పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.