మీరు ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేసినా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా, ఇతర ఏ కారణంతోనైనా వాహనానికి జరిమానా పడిందేమో చూసు కోండి.. ట్రాఫిక్ పోలీసులను తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకోకముందే మీ ఇంటికే ‘ఈ-చలాన్’ వచ్చి చేరుతుంది. అందుకే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా, ట్రాఫిక్ నిబంధనలకు లోబడి నడపాలని పోలీసులు సూచిస్తున్నారు. రోడ్డు నిబంధనలు ఉల్లఘించిన వారిపై కొరడా ఝలిపిస్తున్నారు. రాత్రిపూట మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసుల కంటపడితే లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. హెల్మెట్ లేకుం డా, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ డ్రైవింగ్ ఇలా.. కారణం ఏదైనా.. ఫైన్ మాత్రం భారీగా చెల్లించాల్సిందే. గడిచిన ఎనిమిది నెలల్లో పోలీసులు 1.48 లక్షల మంది వాహదారులపై ఎంవీ యాక్టు కేసులు చేశారు. వారికి రూ.6.15 కోట్ల జరిమానాలు విధించారు.
నిర్మల్ అర్బన్,సెప్టెంబర్ 14: జిల్లా పోలీసులు ట్రాఫిక్ రూ ల్స్ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కొరఢా ఝలిపిస్తున్నారు. మ ద్యం తాగి వాహనాలు నడిపిన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
జిల్లాలో 1.48 లక్షల ఎంవీ యాక్టు కేసుల నమోదు..
జిల్లాలోని 19 మండలాల పోలీస్ స్టేషన్ల పరిధిలో జనవరి 2021 నుంచి ఆగస్టు వరకు నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై ట్రాఫిక్, పోలీసులు ఎంవీ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,48,750 కేసులు నమోదు కాగా, రూ.6 కోట్ల 15 లక్షల 7210 జరిమానా విధించారు. ఇందులో 1,37,028 మంది హెల్మెట్ లేకుండా వాహ నం నడపడం, నో పార్కింగ్ జోన్లో నిలుపడం, ట్రిపుల్ రైడిం గ్, రాంగ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్ కేసులు నమో దు చేశారు. అతి వేగంగా వాహనాలు నడిపిన వాహనదారులపై స్పీడ్ గన్ ద్వారా 3,266 మందికి రూ. 33,45,110 జరిమానా విధించారు. 8456 మంది వాహనదారులపై స్పాట్ కేసులు (ఇతర రాష్టాలకు చెందిన వాహనదారులు నిబంధనలు పాటించక పోవడంతో అక్కడికక్కడే) నమోదు చేసి రూ.52,00700 జరిమానా విధించారు.
మద్యం తాగి నడిపితే లైసెన్సు రద్దు
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మద్యం తాగి వాహనాలను నడుపడంతోనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసుల నివేదికలో తేలింది.దీంతో వాహనదారులు మద్యం తాగి రెండుసార్లు పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ను పూర్తిగా రద్దు చేయనున్నారు. అంతేకాకుండా కొంతమందిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి ఇప్పటి వరకు 20 మందికి జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధిస్తున్నారు.
నెట్ద్వారా తెలుసుకోవచ్చు..
మీ వాహనంపై జరిమానా ఉంటే ఇంటికే ఈ -చలాన్ రూ పంలో వస్తుంది. మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారో లేదో www.echallan.org వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. అందులో మీ వాహనం నంబర్ను ఎంటర్ చేయాలి. దాని కింద పక్కనే కనిపించే కోడ్ను నమోదు చేసి ఎంటర్ చేస్తే ఎంత జరిమానా ఉందో తెలుసుకోవచ్చు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి రో జూ తనిఖీలు చేపడుతున్నాం. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. ద్విచక్రవాహనదారులు హెల్మె ట్ ధరించాలి. లైసెన్స్, ఆర్సీ, బీమా పత్రాలు వెంట ఉంచుకోవాలి. మద్యం తాగి వాహనాలు నడపవద్దు. పెండింగ్ చలాన్లు వెంటనే చెల్లించాలి.
-చల్లా ప్రవీణ్ కుమార్, నిర్మల్ ఎస్పీ