ఇంజినీర్లు ప్రగతి వారధులే కాదు.. సమాజ సారథులు కూడా.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ.. అద్భుత కట్టడాలు, నిర్మాణరంగంలో అత్యద్భుత ప్రతిభ కనబరుస్తూ దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. నాటి ఇంజినీర్ల కట్టడాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇప్పటికీ చెక్కుచెదరకుండా భావితరాలకు ఆదర్శంగా ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాజెక్టు నిర్మాణాలు, ఆలయాలు, వంతెనలు, కోటలు, జైళ్లు ఇలా అనేకం ఉమ్మడి జిల్లా పరిధిలో శతాబ్దాలుగా వారి పనితీరుకు గీటురాయిగా నిలుస్తున్నాయి. నేడు(బుధవారం) భారతీయ తొలి ప్రసిద్ధ ఇంజినీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజినీర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సందర్భంగా ప్రత్యేక ఫొటోఫీచర్..