ఎదులాపురం, ఆగస్టు 17 : పని చేసిన పోలీస్ అధికారులకు పదోన్నతితో గుర్తింపు ఇస్తున్నామని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. ఎస్ఐగా పదోన్నతి పొందిన వీ గంగాసాగర్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఇన్చార్జి ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రానికి చెందిన గంగాసాగర్, హైదరాబాద్ ఐటీఐ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారని ఇన్చార్జి ఎస్పీ తెలిపారు. 1991లో ఉమ్మడి జిల్లా కమ్యూనికేషన్ విభాగం కానిస్టేబుల్ హోదాలో ఎంపికయ్యారని పేర్కొన్నారు. కమ్యూనికేషన్ విభాగం హైదరాబాద్ అదనపు డీజీపీ రవిగుప్త ఈ నెల 14న ఎస్ఐగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఎస్ఐ గంగాసాగర్ను అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ జీ మల్లేశ్, ఎస్ఐ సయ్యద్ అన్వర్ ఉల్ హక్, పోలీస్ కార్యాలయ పరిపాలనాధికారి మహమ్మద్ యూనుస్ అలీ పాల్గొన్నారు.