ఉట్నూర్, ఆగస్టు 17 : మండల కేంద్రంలో అంబేద్కర్ చౌక్ నుంచి అనీల్ కుమార్ క్లాత్ స్టోర్ వరకు రూ.70 లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు జీపీ ఆధ్వర్యంలో తీర్మానించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం జీపీ ప్రత్యేక అధికారి మహేశ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ లైటింగ్ నిర్మాణంపై వాడీవేడిగా చర్చ సాగింది. ఇందుకు కొందరు వ్యతిరేకించగా, మరి కొందరు స్వాగతించారు. చర్చల అనంతరం నిర్మాణానికి జీపీ తీర్మానం తెలిపింది. అలాగే గ్రామాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ప్రత్యేకాధికారి వివరించారు. ప్రకృతి వనం స్థల పరిశీలన చేస్తుండడంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడంతో పాటు రక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్రావు, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అహ్మద్ అజీం, మాజీ జడ్పీటీసీ జగ్జీవన్రావు, మాజీ సర్పంచ్ బొంత ఆశారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కొండేరి రాజేశ్వర్, ఈవో సత్యనారాయణ, జీపీ సిబ్బంది, మాజీ వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.