సోన్, జూలై 27 : జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఇందు కు అధికారులు పక్కాగా సర్వే నిర్వహించి, అర్హులైన రైతులను గుర్తించాలని ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్రెడ్డి అధ్యక్షతన నిర్మల్ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పలువురు సర్పంచ్లు మా ట్లాడుతూ.. నిర్మల్ రూరల్ మండలంలోని చిట్యా ల్, వెంగ్వాపేట్, తల్వేద, ముఠాపూర్, ఎల్లారెడ్డిపేట్, మేడిపెల్లి, న్యూ పోచంపాడ్ తదితర గ్రామా ల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని సమావేశంలో పేర్కొన్నారు. మక్క, వరి, పసుపు, సోయా తదితర పంటలు దెబ్బతిన్నాయన్నారు.
రైతులను ఆదుకునేలా ప్రభుత్వానికి నివేదిక అందించాలని సర్పంచ్లు కోరారు. చైర్పర్సన్ మాట్లాడుతూ.. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సాకారంతో జిల్లాలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, వి విధ శాఖల్లో నష్టానికి సంబంధించి నివేదికలు కోరామన్నారు. రాగానే ప్రభుత్వానికి అందించి, పరిహారం అందేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం వివిధ శాఖల్లోని ఎ జెండా అంశాలను చర్చించారు.
భారీ వర్షాలకు స్తంభాలు పడిపోయి ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉన్నదని నిర్మల్ రూర ల్ ఏఈ అన్నారు. రెండు, మూడురోజుల్లో సరిచేస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో మంచినీటి ట్యాంకులను బ్లీచింగ్పౌడర్తో శుభ్రం చేసేలా చ ర్యలు తీసుకోవాలని సర్పంచ్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. మండలంలోని ఆరు చెరువులకు న ష్టం వాటిల్లిందని తెలిపారు. గ్రామాల్లో కోతుల బె డద నివారణకు చర్యలు తీసుకుంటున్నామని అ టవీ శాఖ అధికారి జైపాల్రెడ్డి తెలిపారు. సర్పంచ్లు తీర్మానం చేసి, సమాచారం ఇస్తే తమ సి బ్బంది వచ్చి కోతులకు ఆపరేషన్ చేస్తారని చెప్పా రు. ఈ సమావేశంలో ఎంపీడీవో సాయిరాం, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.