ఎదులాపురం, జూలై 27: ధ్రువీకరణ పత్రం లేకున్నా, కొత్త రేషన్ కార్డు మంజూరైన వారు వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల్లో వేలి ముద్ర ద్వారా సరుకులు తీసుకోవచ్చునని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని జనార్దన్ రెడ్డి గార్డెన్లో మావల మండల పరిధిలోని లబ్ధిదారులకు రేషన్ కార్డు ధ్రువీకరణ పత్రాలను అదనపు కలెక్టర్ నటరాజన్తో కలిసి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ…జిల్లా వ్యాప్తంగా 4446 మందిని అర్హులుగా గుర్తించి రేషన్ కార్డులను జారీ చేయడం జరిగిందన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో 660, మావలలో 350 కార్డులను అందజేస్తున్నామన్నారు.
ఎన్నికలు, కొవిడ్ పరిస్థితుల కారణంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. ఆప త్కాలంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. డీఎస్వో సుదర్శన్, మా వల తహసీల్దార్ వనజా రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మా వల ఎంపీపీ చందాల ఈశ్వరీ, వార్డు కౌన్సిలర్లు భారత్, రఘుపతి, పవన్నాయక్, షాన్వాజ్, అజయ్, లక్ష్మణ్, నాయకు లు నల్లరాజేశ్వర్, రాంకుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, జూలై 27: జిల్లాలోని కుమ్మరి కులస్తులను ఆదుకుంటామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ప ట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన కుమ్మరి సంఘం నాయకులు ఎమ్మెల్యేను కలిసి మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. సంఘం అధ్యక్షుడు కన్నం మోహన్బాబు, కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు నర్సింలు ,శంకర్, పెద్ది కిష్టన్న, గణపతి, చందు, సత్యనారాయణ ఉన్నారు.