నార్నూర్, జూలై27: పల్లెప్రగతిలో భాగంగా మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి పీ శ్రీనివాస్ పంచాయతీరాజ్శాఖ అధికారులకు సూచించారు. మండలంలోని తాడిహత్నూర్, మాన్కాపూర్, కొత్తపల్లి(హెచ్)తోపాటు పలు గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. శ్మశాన వాటికల నిర్మాణాలు, ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్లు, డంప్ యార్డ్ల వినియోగం, పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. ఆయా గ్రామాల సర్పంచ్లను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పల్లెప్రగతిలో మిగిలిన పనులు పూర్తి చేసి గ్రామాలకు అభివృద్ధి బాటలు వేయాలన్నారు. శ్మశానవాటికల నిర్మాణాల్లో జాప్యంపై ఆరా తీశారు. నాటిన మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలన్నారు. పారిశుధ్యంపై దృష్టి సారించి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా చూడాలన్నారు. బావుల్లో కోర్లినేషన్ చేయాలని సూచించారు. అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం చూపితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఆహ్లాదాన్ని పంచేలా పల్లెప్రకృతి వనాలను తీర్చిదిద్దాలని సూచించారు. అంతకుముందు మాన్కాపూర్లో మొక్క లు నాటారు. డివిజన్ పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్, మండల పంచాయతీ అధికారి స్వప్నశీల, సర్పంచ్ రాథోడ్ సావీందర్, వార్డు సభ్యులు ఉన్నారు.
నిర్లక్ష్యం చూపితే చర్యలు
పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం చూపితే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి పీ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈజీఎస్,పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం సమావేశమయ్యారు. మండలలోని ఆయా పంచాయతీల్లో చేపట్టిన పల్లెప్రగతి పనులపై ఆరా తీశారు. చేపట్టిన పనుల్లో జాప్యం కావడంపై అధికారులను నిలదీశారు. శ్మశానవాటికల నిర్మాణాలు పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కకూ లెక్క చెప్పాల్సి ఉంటుందన్నారు. అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చూపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఎల్పీవో భిక్షపతిగౌడ్, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో స్వప్నశీల, ఈజీఎస్ ఏపీవో జాదవ్ శేషారావ్, సిబ్బంది ఉన్నారు.